కేసీఆర్‌కు వణుకు పుట్టిస్తాం: విజయశాంతి 

కేసీఆర్‌కు వణుకు పుట్టిస్తాం: విజయశాంతి 

నాగార్జున సాగర్: సీఎం కేసీఆర్‌‌కు వణుకు పుట్టిస్తామని బీజేపీ లీడర్ విజయశాంతి అన్నారు. ప్రజలు బీజేపీకి అండగా ఉంటే కేసీఆర్ మెడలు వంచుతామన్నారు. జై తెలంగాణ, వీర తెలంగాణ అంటూ గళమెత్తిన ప్రజలు.. మరోసారి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయనది దోపిడీ పాలని అంటూ ధ్వజమెత్తారు. 

‘సావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానని కేసీఆర్ అంటున్నారు. ఆయన సావు నోట్లో తల పెట్టలే ప్రజల తలలు పెట్టిండు. కేసీఆర్‌‌వన్నీ అబద్ధాలే. విద్యార్థుల బలిదానాలు, సకల జనుల సమ్మె, పోరాటాలతోనే రాష్ట్రం వచ్చింది. దొర అధికారంలోకి వచ్చాక ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటీ నెరవేరలేదు. రెండోసారి కూడా హామీల వర్షం కురిపించారు. అవీ చేయలె. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భగీరథ నీళ్లు, మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఎక్కడ దొరా? తెలంగాణ బిడ్డలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. దొర కాళ్లు పట్టి నేలకు కొట్టాలె. పోరాడే పార్టీ బీజేపీ. ప్రజలకు అండగా ఉంటుంది. కదలిరండి.. దొర మెడలు వంచుదాం. మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రవి కుమార్‌ను గెలింపించాలి’ అని విజయశాంతి కోరారు.